బంగారం ధర తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు ఎప్పుడు స్థిరంగా కొనసాగవు.. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధర భారీగా పెరిగింది. తులం బంగారం 35 వేల దిశగా పయనమవుతున్న సమయంలో నిన్నటి నుండి బంగారం ధర భారీగా పెరిగింది. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిల పెరుగుదలతో 39,770 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయిల పెరుగుదలతో 36,460 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధరకు భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 300 రూపాయిలు పెరుగుదలతో 46,650 రూపాయలకు చేరింది.  

 

అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ స్వల్పంగా పెరగటంతో బంగారంపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,400 రూపాయలు అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 37,200 రూపాయలకు చేరింది.

  

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: