ముప్పై ఐదు వేలకే 55- 2020 ఎడిషన్ టీవీ. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ మార్కెట్ లోకి కళ్ళు చెదిరే టివిని మనముందుకు తీసుకు వస్తుంది. ఒకప్పుడు సీఆర్టీ పిక్చర్ ట్యూబులున్న టెలివిజన్ లదే రాజ్యం అనుకుంటే, ఇప్పుడవన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి. తాజాగా ఎల్ఈడీ టెలివిజన్ల హవా నడుస్తోంది. అది కూడా 4కె పిక్చర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఉన్న టీవీ సెట్లకు మార్కెట్లో మాంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక పండగ సీజన్ వచ్చిందంటే చాలు తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఇప్పుడు షియోమీ కష్టమర్స్ కోసం మంచి ఆఫర్ ను తీసుకువచ్చింది.


సాధారణంగా 40 అంగుళాల పైబడిన టీవీల ధరలు రూ.40 వేల పైనే ఉంటాయి. కాని షియోమి మాత్రం తక్కు ధరకే అతి పెద్ద టీవి ని అందిస్తుంది. నమ్మశక్యం కాని రీతిలో 55 అంగుళాల భారీ స్క్రీన్ తో కూడిన కొత్త మోడల్ ను రూ.34,999 కే అందిస్తోంది. శాంసంగ్, సోనీ, పానాసోనిక్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్లు 4కె టెక్నాలజీ టీవీల ధరలను కాస్త భారీ స్థాయిలోనే వసూలు చేస్తున్నాయి. ఇందుకు భిన్నంగా మంచి ఆఫ్ర్స తో కష్టర్స్ ని తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ లో ఉంది షియోమి.


అంతేకాకుండా ఇక కష్టమర్స్ ని ఆకట్టుకోవడానికి మరో మంచి ఆఫర్ ని కూడా అందిస్తుంది. జనవరి 31వ తేదీ లోపు కొనుగోలు చేసినవారికి టీవీతో పాటు తక్కువ ధరకే ఎయిర్ టెల్ డీటీహెచ్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తోంది. వినియోగదారులు నాలుగు నెలల పాటు ఉచితంగా ప్రసారాలు అందుకోవచ్చు. ఎంఐ వెబ్ సైట్ లోనూ, అమెజాన్ పోర్టల్ లోనూ ఈ సరికొత్త మోడల్ టీవీ డిసెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. త్వరపడండి అంటోంది షియోమి. 

మరింత సమాచారం తెలుసుకోండి: