పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు 3 పైసలు 5పైసలు పెరుగుదలతో ఇప్పుడు 80రూపాయలకు దగ్గరలో ఉంది. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.83 వద్ద స్థిరంగా కొనసాగగా డీజిల్ ధర కూడా రూ.72 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే భారీగా తగ్గనున్నాయి అని మార్కెట్ నిపుణులు చెవుతున్నారు.

 

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో 20 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 79.47 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 16 పైసలు పెరుగుదలతో 71.25 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 78.90 రూపాయలకు చేరగా.. డీజిల్ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో 70.80పైసల్ వద్దకు చేరింది.

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది.

 

 

అయితే గత మూడు వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4 రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో పెరుగుదల వాహనదారులకు కనిపించడం లేదు కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేవలం మూడు వారాలలో 80 రూపాయిలు అయ్యింది. అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే తగ్గనున్నాయి అని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: