జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాన్స్ తీసుకొచ్చి అందరిని సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ మూడు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది.
అయితే జియో కూడా మొన్నటికి మొన్న అక్టోబర్ లో టారిఫ్ రేట్లను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టారిఫ్ రేట్లతో పాటు దానికి తగ్గట్టు ఐయూసీ ప్యాక్ ల ద్వారా డేటాను కూడా అందిస్తుంది. అయితే ఈ రేట్లను పెంచినందుకు అన్ని వైపులా నుండి భారీగా విమర్శలు వచ్చాయి. ఒకానొక సమాయంతో జియో వినియోగదారులు అందరూ మరో నెట్ వర్క్ లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు.
దీంతో జియో ఒకవైపు రేట్లు పెంచుతూనే మరోవైపు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ సంస్ద. ఆ సంచలన నిర్ణయం ఏంటంటే సినీ ప్రేక్షకులను అలరించేందుకు జియో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో జియో సినిమా.. సన్ టీవీ నెట్వర్క్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన సన్ నెక్ట్స్ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది.
ఈ సన్ నెక్ట్స్తో జియో భాగస్వామ్యం అవ్వడం వల్ల తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది. దీని ద్వారా జియో యూజర్లకు సన్ నెక్ట్స్ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం ఇస్తుంది. కాగా జియో సినిమా యాప్లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఏది ఏమైనా జియో జియోనే.. ఎప్పటికప్పుడు మంచి మంచి ప్లాన్లతో ఒకసారి షాక్ ఇచ్చిన మరోసారి ఆ షాక్ కి మించి శుభవార్త అందిస్తారు.