బంగారం ధర తగ్గుదలకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర నేడు భారీగా పెరిగింది. రెండు రోజుల నుండి తగ్గిన ధర అంత ఒక్కరోజులో పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో నేడు గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయిల పెరుగుదలతో 39,940 రూపాయలకు చేరింది.  

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 420 రూపాయిల పెరుగుదలతో 36,650 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర అంతకు మించి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 600 రూపాయిలు పెరుగుదలతో 47,500 రూపాయలకు చేరింది.  

 

అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ స్వల్పంగా పెరగటంతో బంగారంపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,600 రూపాయలు అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 37,400 రూపాయలకు చేరింది.   

 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: