మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. ? అయితే మీకు తీపికబురు అందే అవకాశముంది. సబ్‌స్క్రైబర్లు, పెన్షనర్లు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈపీఎఫ్‌వోకు వ్యతిరేకంగా రామ్‌ లీలా మైదాన్‌లో శనివారం నిరసన తెలిపారు. దీంతో ఈపీఎఫ్‌వోకు షాక్ తగిలింది. 27 రాష్ట్రాలకు చెందిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కిందకు వచ్చే పెన్షనర్లు రామ్‌లీలా మైదాన్‌లో నిరసన వ్యక్తం చేశారు. 


కనీస పెన్షన్‌ను రూ.7,500 గా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షనర్లు చాలా కాలంగా కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పెన్షనర్లు పీఎంవో ఆఫీస్‌కు కూడా వెళ్లారు. అక్కడ అధికారులకు మెమోరాండమ్ కూడా సమర్పించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గురించి ఈపీఎఫ్‌వో పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.ఈపీఎస్ 95 నేషనల్ ఎజిటేషన్ కమిటీ నేషనల్ జనరల్ సెక్రటరీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోకపోతే జనవరి 25 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.


‘కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రావిడెంట్ ఫండ్‌‌లో జమవుతున్నాయి. అది మా డబ్బులు. దీంతో మాకు సామాజిక ఆర్థిక భద్రత కలగాలి. కోశియారి కమిటీ ప్రాతిపాదనలకు అనుగుణంగానే మా డిమాండ్లు ఉన్నాయి’ అని ఒక నిరసనకారుడు తెలిపారు.
కోశియారి కమిటీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి 2013లోనే పలు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కనీస పెన్షన్, డియర్‌నెస్ అలవెన్స్ అంశాలకు సంబందించి ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాకుండా భాగస్వామి మరణిస్తే విడోకు ఆర్థిక భద్రత కల్పించాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది.


కనీస పెన్షన్ పెంపుతోపాటు ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ భాగస్వామికి ఉచిత మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పించాలని ఎజిటేషన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈపీఎఫ్ 95 కిందకు రాని సబ్‌స్క్రైబర్లకు మినిమమ్ పెన్షన్ రూ.5,000గా నిర్ణయించాలని పేర్కొంది.


ఇకపోతే ఉద్యోగుల బేసిక్ వేతనం 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లకు వెళ్లిపోతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది. ఇకపోతే ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు రిటైర్మెంట్ తర్వాత రూ.2,500 కనీస పెన్షన్ పొందుతున్నారని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: