పసిడి ధరలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గుముఖం పట్టాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. అయితే గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు గత నాలుగు రోజుల నుండి తగ్గుముఖం పట్టి పసిడి ప్రేమికులకు పండుగ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో 39,210 రూపాయలకు చేరింది. 

        

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలతో 36,940 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర మాత్రం గెట్టి షాక్ ఏ ఇచ్చింది. కేజీ వెండి ధర 90 రూపాయిలు పెరుగుదలతో 46,490 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

       

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిల తగ్గుదలతో 38,050 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిలు తగ్గుదలతో 37,880 రూపాయలకు చేరింది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది అని, ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు క్షీణించింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: