డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (ఇండియా పోస్ట్) వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ ను ప్రజలకు అందిస్తోంది. వీటితో ఆకర్షణీయ రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా చాల పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రజలకు లభిస్తాయి. దీనితో ఒక ఆర్థిక సంవత్సరంలో పోస్టాఫీస్ స్కీమ్స్‌ తో రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆ స్కీమ్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం.

 

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ గురించి ఇప్పుడు చూద్దాం.ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ సేవలను అందిస్తోంది. ఏడాది రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సంవత్సరాల కాల పరిమితితో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్లపై పన్ను మినహాయింపు చాలానే ప్రయోజనాలున్నాయి. ఈ అకౌంట్లపై 7.7 శాతం వరకు వడ్డీ మనకు లభిస్తోంది. బ్యాంకులు అందించే వడ్డీ కన్నా ఇది 20 నుంచి 80 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువగా ఉంటుంది.

 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇలా మనం పొందవచ్చు. ఈ పథకంలో చేరినా కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ మనకు లభిస్తాయి. ఎన్ఎస్‌సీ స్కీమ్‌ పై 7.9 శాతం వరకు వడ్డీ మనకు వస్తుంది. మెచ్యూరిటీ కాలం దీనికి ఐదేళ్లు. కనీసం రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇందులో. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. వీటిపై లోన్ కూడా మనం పొందొచ్చు.

 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ విషయానికి వస్తే 60 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌ లో అర్హులు. ముందుగానే పదవీ విరమణ తీసుకుంటే 55 ఏళ్లకు కూడా పథకంలో చేరే అవకాశం కలిపించారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. దీనిపై ఇప్పుడు 8.3 శాతం వడ్డీ వస్తుంది మనకి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇందులో డిపాజిట్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: