బంగారం ధర.. వద్దు అసలు చూస్తే కోపం వస్తుంది.. ఎంత దారుణంగా పెరిగిపోయాయి అంటే.. చూస్తూనే కోపం వచ్చేలా పసిడి ధరలు పెరిగిపోయాయి. భారతీయులకు ఎంత ఇష్టమైన బంగారం అయితే మాత్రం అంత దారుణంగా పెరుగుతూందుందా ? పెరగటానికి కూడా అర్థంపర్థం లేకుండా బంగారం ధరలు పెరిగాయి. మాములుగా ఒకరోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో అయితే తగ్గింది మళ్ళి రెండింతలు పెరిగే వరుకు వెనకడుగు వెయ్యటం లేదు బంగారం ధర. 

 

దీంతో బంగారం కొనే వారు ఆశ్చర్యానికి గురై బంగారం కొనాలనుకునే వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆలా రోజు రోజుకు బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర వారం రోజుల నుండి తగ్గుముఖం పట్టింది. అయితే ఈరోజు మళ్ళి యధావిధిగా పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల పెరుగుదలతో 40,450 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల పెరుగుదలతో 37,100 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర పరుగులు పెట్టింది. మాములు పరుగులు కాదు ఒలంపిక్స్ లో పిటి ఉష పరిగెత్తినట్టు ఈ వెండి ధరలు పరుగులు తీశాయి. దీంతో కేజీ వెండి ధర 1,300 రూపాయిలు భారీ పెరుగుదలతో నేడు 49,100 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: