పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలల నుండి భారీగా పెరుగుతున్నాయి. ప్రజలకు తెలియకుండా.. గొడవలు జరగకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.79.68 వద్దకు చేరగా, డీజిల్ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.73.77కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

అమరావతిలో 7 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 79.10 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 16 పైసలు పెరుగుదలతో 71.62 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 78.73 రూపాయలకు చేరగా.. డీజిల్ ధర కూడా 16 పైసలు పెరుగుదలతో 72.28పైసల్ వద్దకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.74 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 67.24 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. 

 

అయితే రెండు నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4 రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో పెరుగుదల వాహనదారులకు కనిపించడం లేదు కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేవలం నెల రోజులలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగె ఉంటె ఇంకొక నెలలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయిలు అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: