మన భారతదేశం పసిడి ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బంగారం ధరలు తగ్గాయి అంటే చాలు.. ఆస్తులు అమ్మి ఆయిన సరే బంగారం కొనేయాలనుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే పసిడి ధరలు ఈ మధ్యకాలంలో భారీగా పెరిగాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. 

 

నిన్నటి వరుకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా భారీగా తగ్గింది. అయితే నిన్నటి వరుకు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో సంబరాలు చేసుకుంటున్నారు పసిడి ప్రేమికులు. ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిల తగ్గుదలతో 40,670 రూపాయలకు చేరింది.

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల తగ్గుదలతో 37,270 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. దీంతో కేజీ వెండి ధర 50 రూపాయిలు తగ్గుదలతో 49,300 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,050 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,880 రూపాయల వద్ద కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: