పెట్రోల్, డీజిల్ ధరలు రెండు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 11 పైసలు పెరుగుదలతో ధర రూ.79.96 వద్దకు చేరగా, డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.74.16కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా పెరిగాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. 

 

అయితే గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 5 రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో పెరుగుదల వాహనదారులకు కనిపించడం లేదు కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేవలం రెండు నెలలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగె ఉంటె ఇంకొక నెలలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయిలు అవుతుంది. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: