గత రెండు రోజులు తగ్గిన బంగారం ధర మళ్ళి పుంజుకుంది.అసలు ఈ బంగారం ధరల ఎంత పెరిగిపోయాయి అంటే సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం ఇంత దారుణంగా పెరిగేసరికి ఎవరు కొనలేకపోతున్నారు. మాములుగా ఒకరోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో అయితే తగ్గింది మళ్ళి రెండింతలు పెరిగే వరుకు వెనకడుగు వెయ్యటం లేదు బంగారం ధర. 

 

ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల పెరుగుదలతో 40,750 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల పెరుగుదలతో 37,350 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 49,100 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: