అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఈయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు ఎవరు ఊహించలేరు. అలాగే ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల వాటి ఎఫెక్ట్ ఎవరిపై పడుతుందో కూడా ముందుగానే చెప్పలేం. ఇప్పుడు ఈ ట్రంప్ గురించి మనకెందుకు అనుకుంటున్నారా..?  ఈయన బాగ్దాద్‌ పై డ్రోన్లతో దాడి చేయించారు. ఇందులో ఇరాన్ కీలక సైనికాధికారి మరణించారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మనపై (భారత్)  పడింది. ఎంతలా అంటే.. ఒకే రోజు రూ.3 లక్షల కోట్లు ఎగిరిపోయేంత... నష్టం వాటిల్లింది అయన వలన.


మన భారత మార్కెట్ సోమవారం కుప్పకూలింది. మార్కెట్ పడిపోవడానికి గల కారణాంమ్ అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలే అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంచ్‌ మార్క్ సూచీలు బేర్‌ మన్నాయి. మార్కెట్ పేకమేడలా కూలిపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 851 పాయింట్ల మేరకు పతనమైంది. అలాగే.. నిఫ్టీ కూడా 252 పాయింట్లకు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 788 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద, నిఫ్టీ 234 పాయింట్ల నష్టంతో 11,993 వద్ద క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. నిఫ్టీ 12 వేల కిందకు వచ్చేసింది. 


రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదల, బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్లు వంటి అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ను దెబ్బతీశాయి. నిఫ్టీ 50లో టైటన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటన్ దాదాపు 2 శాతం పెరిగింది. అదేసమయంలో ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, జీ ఎంటర్‌ టైన్‌ మెంట్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎస్‌బీఐ దాదాపు 5 శాతం క్షీణించినట్లు తెలుస్తుంది.

 
నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతానికి పైగా కుప్పకూలింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లన్నీ 2 శాతానికి పైగా క్షీణించాయి. అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 16 పైసలు నష్టంతో 71.97 వద్ద కదలాడుతోంది. ఇంట్రాడేలో రూపాయి 72 స్థాయి కిందకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.15 శాతం పెరుగుదలతో 69.39 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.90 శాతం పెరుగుదలతో 63.62 డాలర్లకు ఎగసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: