టెలికాం సంస్థల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అందుకే వినియోగదారులను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక ఆఫర్లు ఇస్తున్నారు. ఎయిర్ టెల్ సంస్థ.. కస్టమర్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందుకునే సంస్థల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ సంస్థ అందిస్తున్న వైఫై కాల్స్ సౌకర్యాన్ని దాదాపు 10 లక్షల మంది వినియోగిస్తున్నారట.

 

ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించిందా సంస్థ.. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా తమ చందాదార్లు వినియోగిస్తున్నారని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. వోల్టే నెట్ వర్క్ నుంచి ఏ వైఫై నెట్ వర్క్ కు అయినా నేరుగా మారే సదుపాయం కలగడం వల్ల, భవనాల్లోపల కూడా వినియోగదారులు స్పష్టంగా కాల్స్ చేసుకునే వీలవుతోందని సంస్థ వివరించింది.

 

మొత్తం 16 బ్రాండ్లలో 100కి పైగా మోడల్ స్మార్ట్ ఫోన్లలో వైఫై కాలింగ్ సదుపాయం లభిస్తోంది. మరిన్ని మోడళ్లకు విస్తరించేందుకు తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎయిర్ టెల్ సంస్థ తెలిపింది. ఇక ఎయిర్ టెల్ వినియోగదారులకు పండుగే అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: