సంక్రాంతి గుడ్ న్యూస్ ఇది.. పసిడి ప్రియులకు కమ్మని వార్త.. బంగారం ధరలు.. ఎప్పుడు తగ్గుతూ.. పెరుగుతూ వచ్చే ధరలు.. గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతాయి. ఇలా రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే బంగారం ఈ మధ్యకాలంలో దారుణంగా తయారు అయ్యింది. అయితే ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. గత వారం నుండి బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

 

నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయిల తగ్గుదలతో 41,040 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 390 రూపాయిల తగ్గుదలతో 37,620 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది.

 

దీంతో కేజీ వెండి ధర ఏకంగా 200 రూపాయిలు తగ్గుదలతో 48,700 రూపాయిల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.

 

విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పసిడి ప్రేమికులు బంగారం కావాల్సినంత కొంటారో చూడాలి. కాగా బంగారం కొనేవారు 30 శాతం తగ్గారని తాజా నివేదికలో తేలింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: