ఈ మధ్యకాలంలో టెలికాం సర్వీసులు ఎలా ఛార్జీలు పెంచాయి అందరికి తెలిసిందే. ఇన్నాళ్లు ఫ్రీగా అతి తక్కువ ధరలకే ఇచ్చినవి అన్నికుడా ప్రస్తుతం భారీగా పెరిగిపోయాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని టెలికం సర్వీసులు ప్రత్యర్థికి చమటలు పట్టించాలి అనే ఉద్దేశ్యంతో ఆఫర్లు ఇస్తూ ఉంటుంది.
అలానే మొన్నటి వరుకు జియో బంపర్ ఆఫర్లు ఇచ్చింది.. ఆ తర్వాత ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్లు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది.. అలానే మరికొద్దిరోజులకు వోడాఫోన్ అదిరిపోయే ప్లాన్స్ ను పరిచయం చేసి అదరగొట్టింది. ఇప్పుడు మరో బిఎస్ఎన్ఎల్ అధిరిపోయే బంపర్ ఆఫర్ ను ఇచ్చి వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ రంగ సంస్థ అయినా బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ ముగిసిన తర్వాత కూడా మరో వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 105, 153, 171, 186, 429, 485, 666, 1699 రీఛార్జిలు చేసుకున్న కస్టమర్లు ప్లాన్ ముగిసిన వారం రోజుల వరకు వ్యాలిడిటీని ఇస్తుంది.
ఈ వారం రోజులకు అదనంగా రూ.19 మెయిన్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి మినహాయించనుంది బిఎస్ఎన్ఎల్. అంతే కాకుండా రద్దయిన నేస్తం వినియోగదారులకు ఈ అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఇది బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ ఏ..