మీరు ఉద్యోగులా.. మీ ఆఫీసు రికార్డుల్లో ఆధార్ కార్డు కానీ.. పాన్ కార్డుగా నమోదై ఉందా.. ఉంటే ఓకే..లేకపోతే అర్జంటుగా చేయించండి.. ఎందుకంటే.. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు కానీ.. అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలోనే కట్ చేయమని కేంద్రం చెబుతోంది.

 

 

మేం చెప్పినా.. సంస్థల మేనేజ్ మెంట్లు ఈ టీడీఎస్ నియమాలను పాటించకపోతే వారికి కూడా జరిమానాలు విధిస్తామని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. ఒక వేళ ఇవ్వకపోతే 20శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి కత్తిరించాలి.

 

 

జీతం ఇచ్చేటప్పుడే టీడీఎస్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. మేరకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యిలర్ జారీ చేసింది. సాధారణంగా 20శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్ , లేదా ఆధార్ నంబర్ ఇవ్వకపోతే వారికి జీతంలో 20శాతం వరకు పన్నుకోత విధిస్తారు.

 

 

20శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధిస్తారు. అంతే కాదు.. దీంతోపాటు 4శాతం హెల్త్ , ఎడ్యూకేషన్ సెస్ కూడా వసూలు చేస్తారు. అందుకే జర జాగ్రత్త..

మరింత సమాచారం తెలుసుకోండి: