బంగారం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. ఒకప్పుడు ధరలు పెరిగిన మళ్ళి తగ్గేవి కానీ ఇప్పుడు ఆలా కాదు.. భారీగా అంటే భారీగా పెరుగుతాయి.. ఏమాత్రం తగ్గవు ఈ బంగారం ధరలు. అయితే బంగారం ధర ఈ ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం అంటే భయపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పండగ అంటే చాలు బంగారం కొనేస్తారు. 

 

ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 10 రూపాయిల పెరుగుదలతో 42,100 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 38,630 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం స్థిరంగా నడిచింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 49,200 రూపాయిల వద్ద స్థిరంగా చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: