భారతీయ దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాట పట్టింది. పార్లమెంట్‌ లో నేడు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే - 2020 ఇన్వెస్టర్లకు అంతగా బాగు అనిపించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేయడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 6 నుంచి 6.5 శాతం మధ్యలో ఉండొచ్చని తెలిపింది. దీనితో మార్కెట్‌ పై ప్రతికూల ప్రభావం నడిచింది. 

 

అయితే నేడు సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 40,723 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్ల వద్ద ముగిసాయి. ఇందులో మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా కనిపించింది. బ్యాంక్ షేర్లు మాత్రం కొంతమేరకు లాభపడ్డాయి.

 

నేటి స్టాక్  మార్కెట్ హైలైట్స్ మీకోసం..

నిఫ్టీ - 50లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో షేర్లు బాగా లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 4 శాతం వరకు పెరిగింది. ఇంక అదేసమయంలో టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, యూపీఎల్, ఐఓసీ షేర్లు బాగా నష్టపోయాయి. టాటా మోటార్స్ ఏకంగా 5 శాతం వరకూ పడిపోయింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికి పైగా నష్ట పోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌ లు కొంతవరకు లాభపడ్డాయి.


ఇంక అమెరికా డాలర్‌ తో పోలిస్తే మన ఇండియన్ రూపాయి కాస్త లాభాల్లో ట్రేడవుతోంది. మొత్తానికి 12 పైసలు లాభంతో 71.37 వద్ద నేడు ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు కొద్దివరకు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.22 శాతం పెరుగుదలతో 58.42 డాలర్లకు రేటు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.33 శాతం పెరుగుదలతో 52.31 డాలర్లకు మార్కెట్ ఎగసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: