బంగారం ధర భారీ షాక్ ఇచ్చింది.. గత కొద్దీ రోజుల నుండి తగ్గుదలకు నేడు భారీ బ్రేకులు వేసింది. అంత భారీగా ధరలు పెరిగిపోయాయి. సాధారణంగానే మన భారతీయులకు బంగారం అంటే పిచ్చి.. ఎంత పిచ్చి అంటే.. ఇంట్లో ఒక లక్ష రూపాయిలు ఉంది అంటే.. పద బంగారం కొందాం అనేంత పిచ్చి. అయితే అలాంటి అంత పిచ్చి ఉన్న సరే ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితి. 

 

ఎందుకంటే.. బంగారం ధర ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం అంటే భయపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పండగ అంటే చాలు బంగారం కొనేస్తారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 190 రూపాయిల పెరుగుదలతో 42,520 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయిల పెరుగుదలతో 38,980 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర అదే బాట పట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల పెరుగుదలతో 49,000 రూపాయిల వద్దకు చేరింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి ఈ బంగారం ధరలు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: