చైనా లోని కరోనా ఎఫెక్ట్ బంగారం మీద కూడా చూపించింది. ఫలితంగా మరోసారి బంగారం ధర భగ్గుమంది. చైనా లోని కరోనా వైరస్ భయాలు బంగారం ధర పెరగడానికి బాగా కలిసొచ్చాయి. అక్కడ ప్రజల్లో మరణ భయం ఒక్కసారిగా పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ అయిన బంగారం వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఈ ఎఫెక్ట్ భారతదేశ మార్కెట్‌పై కూడా పడింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకుంది. దీనికి తగ్గట్టుగానే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి కూడా బలహీనపడటంతో పసిడి ధర భగ్గుమంది. వరుసగా మూడు రోజులు గా  తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది.

 

గురువారం మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం కొనుగోలుదారునికి చెమటలు పట్టించింది . కరోనా ఎఫెక్ట్ కారణంగా మదుపరులు ఆసక్తి చూపకపోవడం పతనానికి ఒక రకంగా కారణం అయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో బంగారం ధర తో పాటు వెండి ధర కూడా బాగా పుంజుకుంది .

 

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో వచ్చిన మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరి మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపుతాయి.

 

 శుక్రవారం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర పసిడి ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.38,640 నుంచి రూ.38,880కు పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు అధికంగానే ఉన్నాయి.

 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38వేల 880కు చేరింది. వెండి ధర రూ.49వేలకు పెరిగింది. విశాఖపట్నం మార్కెట్లోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.

 

 ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.40వేల 900కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.39వేల 700కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.200 పెరుగుదలతో రూ.49వేలకు చేరింది.

 

వెండి ధర కూడా టాప్ లేపుతుంది. కేజీ వెండి ధర రూ.200 పైకి కదిలింది. దీంతో రూ.48,800 నుంచి రూ.49,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణాల తయరీదారుల నుంచి పెరిగిన డిమాండ్ వెండి ధర పెరగడానికి కారణం అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: