రెడ్ మి.. ఈ చైనా కంపెనీ మొబైల్ మార్కెట్లో విప్లవమే సృష్టించిది. అత్యధిక ఫీచర్లు అందుబాట ధరలతో ఆకట్టుకుంటోంది. రెడ్ మీ సీరిస్ అత్యధిక ఆదరణ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెడ్ మి నోట్ 8 ప్రో ధరను షియామీ కంపెనీ తగ్గించడం విశేషం.

 

 

వాస్తవానికి ఈ రెడ్‌మి నోట్ 8 ప్రొ ధర మార్కెట్ లో రూ. రూ. 14,999 .. అయితే ఇప్పుడు ఈ ధరను వెయ్యి రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం దీని ధర 13,999కు వచ్చేసింది. ఇక ఇందులోనే 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ ధర రూ. 15,999 అయితే.. 8జీబీ+128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.17,999.

 

 

అసలే చైనాలో కరోనా దెబ్బతో దిగుమతులు తగ్గాయి. ఆ మేరకు మొబైళ్ల రేట్లు పెరిగాయి కూడా. అయినా సరే షియామీ కంపెనీ మాత్రం రెడ్‌మి నోట్ 8 ప్రొ ధరను తగ్గించింది. ఇదే షియోమీ కంపెనీ కరోనా వైరస్ కారణంగా చూపించి ఇటీవల ‘రెడ్‌మి నోట్ 8’ బేస్ మోడల్ ధరను పెంచిన సంగతి తెలిసిందే.

 

 

కానీ ప్రస్తుతం షియోమీ.. ‘రెడ్‌మి నోట్ 8 ప్రొ’ రను తగ్గించడం విశేషం. ఇక రెడ్‌మి నోట్ 8 ప్రొ స్పెసిఫికేషన్లు సంగతి చూస్తే.. ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 6.53 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియా టెక్ హెలియో జి90టి ప్రాసెసర్, 64 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: