రోజురోజుకు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది. ఎంత భారతీయులకు బంగారం అంటే ఇష్టం ఉంటె మాత్రం అలా ధరలు పెరిగిపోతాయి? కొంచమైనా బంగారం ధరలు తగ్గద్దు. బంగారం ధరలు భారీ అంటే అతి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గేది 30 రూపాయిలు 40 రూపాయిలు. పెరిగేది 300, 400 రూపాయిలు. ఇలా అయితే సామాన్యులు బంగారం ఎలా కొంటారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోతున్నాయి. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 520 రూపాయిల పెరుగుదలతో 43,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 520 రూపాయిల పెరుగుదలతో 39,650 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అలాగే పరుగులు పెట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల పెరుగుదలతో 49,900 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: