పెట్రోల్, డీజిల్ ధరలు ఇన్నాళ్లు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2 నెలలలో 5 రూపాయిలు తగ్గింది. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళి పెరగటం ప్రారంభించాయి. ఒక్కసారి పెరగటం స్టార్ అయ్యాయి అంటే వాటిని ఆపడం ఎవరి తరము కాదు.. ఇంకా అందుకే మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయని. 

 

ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ మార్కెట్ లో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.76.45 వద్దకు చేరగా, డీజిల్ ధర రూ.73.96కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా పెరిగాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

 

అమరావతిలో 10 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 76.54 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 12 పైసలు పెరుగుదలతో 71.34 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 76.90 రూపాయలకు చేరగా.. డీజిల్ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో 70.91పైసల్ వద్దకు చేరింది.  

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. మరి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ అసలు తగ్గుతాయా? లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: