రోజురోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది.  బంగారం ధరలు భారీ అంటే అతి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గేది 30 రూపాయిలు 40 రూపాయిలు అయితే పెరిగేది 300, 400 రూపాయిలు. ఇలా అయితే సామాన్యులు బంగారం ఎలా కొంటారు.. అసలు కొనగలమా? ఈ బంగారాన్ని అనే ఆలోచన వచ్చేసింది. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 44,430 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 40,730 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 51,000 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ఇలాగే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: