కేంద్ర ప్రభుత్వం  లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అతి త్వరలో ప్రకటించనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం కేంద్రం ఈ ప్యాకేజీలో ప్రధానంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రాయితీలు అందనున్నాయని తెలుస్తోంది. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం పడకుండా 1,75,000 కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రధానంగా సామాన్యులను దృష్టిలో కేంద్రం రూపొందించింది. మోదీ ప్రభుత్వం ప్రధానంగా ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణంపై ప్యాకేజీలో దృష్టి పెట్టింది. 
 
ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, వృద్ధిరేటు పెంచడానికి కేంద్రం ఉద్దీపన పథకాలు ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్రం చిన్న పరిశ్రమలు చెల్లించాల్సిన రుణాలపై 2 శాతం రాయితీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు ఉద్దీపనలకు తోడు కేంద్రం ఆదాయం తగ్గితే 2021 ఆర్థిక సంవత్సరానికి లోటు 4.8 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. జూన్ త్రైమసికానికి జీడీపీ 2.5 శాతానికి తగ్గుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: