కరోనా వైరస్ వల్ల డెట్ మార్కెట్లు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కరోనా వైరస్ వల్ల డెట్ మార్కెట్ లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థ తాజాగా ఆరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను క్లోజ్ చేసింది. దీంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమపై నెలకొన్న ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది.

 

ఆర్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కోసం రూ.50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆర్‌బీఐ ఫిక్స్‌డ్ రెపో రేటుతో 90 రోజుల వరకు రెపో కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు ఇందుకోసం బ్యాంకులు బిడ్లను దాఖలు చేయవచ్చు. కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్దపై పడే భారాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ అప్రమత్తతతో వ్యవహరిస్తోంది.

 

కోవిడ్ 19 వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌పై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించడానికి రూ.50 వేల కోట్లతో ప్రత్యేకమైన లిక్విడిటీ ఫెసిలిటీ స్కీమ్ (ఎస్ఎల్ఎఫ్ ఎంఎఫ్) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

మే 11 వరకు అందుబటులో ఉండే ఈ స్కీమ్ లో 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు. ఆర్బీఐ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా టైమ్ లైన్, అమౌంత్ ను సమీక్షిస్తుంది. ఎస్ఎల్ఎఫ్ ఎంఎఫ్ స్కీమ్ కింద పొందిన నిధులను బ్యాంకులు కచ్చితంగా కేవలం ఎంఎఫ్‌లకు లిక్విడిటీ సౌకర్యాన్ని పెంచేందుకు వినియోగించాలి. అంటే ఎంఎఫ్‌లకు రుణాలు ఇవ్వడం, వాణిజ్య పత్రాల్లో ఇన్వెస్ట్ చేయడం, కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడం వంటివి చేయాలి.              

మరింత సమాచారం తెలుసుకోండి: