రాష్ట్రంలో లిక్కర్ మస్తు అమ్ముడవుతోంది. లాక్ డౌన్ సడలింపులతో తెలంగాణ మందుబాబులు తెగ తాగేస్తున్నారు. దాదాపు నెలన్నర తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు విజృంభిస్తున్నారు. ఫలితంగా లిక్కర్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే లిక్కర్ సేల్స్ రూ.902 కోట్లకు చేరుకోవడం గమనార్హం. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు డబుల్ సేల్స్ జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్శాఖ విడుదల చేసిన లెక్కలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రెడ్జోన్గా ప్రకటించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సేల్స్ ఎక్కువగా జరుగుతుండటం మరో విశేషం.
ఇదిలా ఉండగా వైన్స్ మళ్లీ బంద్ చేస్తారనే వార్తలతో చాలామంది పెద్ద మొత్తంలో కొని పెట్టుకుని దాచుకుంటుండటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు లిక్కర్ అమ్మకాలకు అనుమతినిచ్చింది. అయితే చాలా చోట్ల 6 తర్వాత కూడా వైన్ షాపులు తెరుచుకునే ఉంటున్నాయి. అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరి స్తున్నారు. ఇక ప్రభుత్వం లిక్కర్పై సగటున 16 శాతం లిక్కర్ రేట్లు పెంచిన ఏమాత్రం కొనుగోళ్లు తగ్గకపోగా పెరగడం విశేషం. ఈ నెల 6న మొదలైన సేల్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
6వ తేదీ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.902 కోట్ల మద్యం డిపోల నుంచి వైన్స్కు తరలించగా రోజుకు సగటున రూ.129 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఈనెల 8న అత్యధికంగా రూ.190 కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈనెల 10న అత్యల్పంగా రూ.37 కోట్ల అమ్మాకాలు మాత్రమే జరిగాయి. ఇదిలా ఉండగా గత ఏడాది ఇదే మే నెలలలో రూ.1,847 కోట్ల అమ్మకాలు జగినట్లు తెలుస్తోంది. అంటే సగటున రోజుకు రూ.60 కోట్లే అమ్మారు. ఈసారి మాత్రం రెట్టింపు అంటే రూ.129 కోట్ల అమ్మకాలు జరగడం గమనార్హం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple