ఇండిగో ఎయిర్లైన్స్ విమాన ప్రయాణీకులకు అద్భుత కబురు అందించింది.
న్యూఢిల్లీ నుంచి జోధ్పూర్కు ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్పూర్తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్ రూట్లలోనూ డైరెర్ట్ ఫ్లైట్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులు మొదలవుతాయి. ఇక అగర్తలా, దిబ్రూగఢ్ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది.
మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇండిగో ఎయిర్లైన్ వెల్లడించింది.