టెలికామ్ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా క్రికెట్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు వుండే క్రేజే వేరు. ముఖ్యంగా ఇండియా ఆడే మ్యాచ్ లకు మాములు ఆదరణ ఉండదు. అయితే క్రికెట్ ను మొబైల్ , డెస్క్ టాప్ లలో వీక్షించాలంటే హాట్ స్టార్ , సోనీ లివ్ వంటి యాప్ లలో డబ్బులు కట్టాల్సివచ్చేది. దాంతో అందరికి క్రికెట్ ను చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తకుండా.. క్రికెట్ అభిమానులకు జియో సంచలన ఆఫర్ ను తీసుకొచ్చింది.
అదేంటంటే రానున్న సౌత్ ఆఫ్రికా -ఇండియా సిరీస్ ను జియో తమ యూజర్లు కు ఫ్రీ గా వీక్షించే సదుపాయం కల్పించింది ఇందుకోసం యూజర్లు జియో టీవీ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కడ వున్నా మీ ఫోన్ లో నెట్ ఉండి అందులో జియో యాప్ ఉంటే సరిపోతుంది. ఆసిరీస్ మొత్తాన్ని ఇంగ్లీష్ , హిందీ తోపాటు తెలుగు , తమిళ , కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియా తో ఒప్పుందం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ తో జియో.. తమ యూజర్ల కు మరింత చేరువకావాలని భావిస్తుంది.