గత కొంత కాలంగా తెలుగులో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న మా టీవి   స్టార్ ఇండియాలో విలీనమైంది.  మా టీవీ స్టార్ ఇండియాలో విలీనమైనట్లు ఆ ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం స్టార్ ఇండియా ఎనిమిది భాషల్లో 40 టెలివిజన్ చానల్స్ను కలిగి ఉంది. ఆ మద్య మా టెలివిజన్ నెట్వర్క్ కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్ ను స్టార్ ఇండియా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

అధికారికంగా ఈ డీల్ ఎంతకు సెట్ అయ్యిందో చెప్పలేదు కానీరూ.2500 కోట్లు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచన.  మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు, నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలకు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే.  తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టిన మా చానల్ ఇప్పుడు లాభాల బాట నడిపించింది.  మా టీవీ చానళ్లు స్టార్ లో కలసిపోవడంతో ఇకపై కార్యక్రమాలు, సీరియళ్లు ఏవైనా మార్పులు ఉంటాయా లేదా అని వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: