టెలీకాం మార్కెట్ లో జియో తనదైన శైలి లో దూసుకుని పోతోంది. దేశం మొత్తం ఇప్పుడు జియో జియో అంటూ కలవరిస్తున్న వేళ అన్ని కంపెనీల షేర్ లూ నష్టాలలో ముగుస్తున్నాయి. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నా కూడా ఇతర కంపెనీల వైపు చూడడం కాదు కదా కనీసం వాటి గురించి మాట్లాడట్లేదు సగటు వినియోగదారుడు. ఇప్పటికే టారిఫ్ ఆఫర్ లు అన్ని కంపెనీ లూ సగానికి సగం తగ్గించి పారేసాయి. ఒక సర్వే ఇప్పుడు జియో కి సంబంధించిన షాకింగ్ విషయాలని బయటకి తీసుకుని వచ్చింది. ముఖేష్ అంబాని కి చెందిన జియో ప్రపంచంలోనే అత్యధికమంది వినియోగదారులు ఉన్న సంస్థ గ రెండో స్థానం లో నిలిచింది. యాభై ఆరు శాతం మంది భారతీయులు జియో సిమ్ ని తమ రెండో సిం కార్డ్ గా వాడుతున్నారు. కేవలం 24 శాతం మంది మాత్రమే జియోకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది. 11 % మంది మాత్రం జియో ఎలా ఉంది ఏంటి అనేది లెక్కలు వేసుకుని చూసుకుంటున్నారు. అలాంటి ఉద్దేశ్యం తో మాత్రమే ఈ ఫోన్ ని , సిమ్ నీ ఉపయోగిస్తున్నారు. మిగిలిన మరో 9 శాతము మంది జియోను ఏ పద్దతిలోనూ ఉపయోగించుకూడదని భావిస్తున్నారని ఈ రిపోర్టులో తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: