భారత దేశంలో గత కొంత కాలంగా టెలికాం రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్న విషయం తెలిసిందే. ఇక నెట్ వర్క్ సంస్థల్లో కాంపిటీషన్ పెరిగిపోవడంతో యూజర్ చార్జీలు పోటీ పడీ మరీ తగ్గిస్తున్నాయి. ఇక జియో వచ్చినప్పటి నుంచి టెలీకాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా టెలికాం రంగ ప్రముఖ సంస్థ ఐడియా తమ వినియోగదారుల ముందు మరో ఆఫర్ను ప్రవేశపెట్టింది.
రూ.357తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. 28 రోజుల వాలిడిటీ ఉండే ఈ ప్యాక్ ద్వారా రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.
టెలికాం రంగంలో రియలన్స్ జియో ఇస్తోన్న పోటీతో ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జియోలో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ అందుకునే ప్యాక్ ఉంది.