ఈ మద్య కాలంలో రిలయన్స్ జియో చేస్తున్ మాయాజాలంతో దాదాపు అన్ని నెట్ వర్క్ సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో నెట్ వర్క్ సంస్థలు కస్టమర్లకు సరికొత్త ప్యాక్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్యాక్ను ప్రకటించింది. 84 రోజుల కాలపరిమితితో రోజు 1జీబీ 3జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ (నేషనల్ రోమింగ్ ఉచితం), రోజుకు వంద ఎస్సెమ్మెస్లు ఆఫర్ చేస్తున్న ఈ ప్యాక్ ఖరీదు రూ.509. ఈ ఆఫర్ ద్వారా రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.
కాగా, రిలయన్స్ జియో రూ.459 ప్యాక్కు, ఎయిర్టెల్కు రూ.509 ప్యాక్కు ఇది డైరెక్ట్ పోటీ. రిలయన్స్ జియో తన రూ.459 ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది.కాగా, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లు 4జీ డేటా ఆఫర్ చేస్తుండగా ఐడియా 3జీ డేటాను అందిస్తుండడం గమనార్హం.
ఐడియా ఇటీవల తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్ను అప్గ్రేడ్ చేసింది. గతంలో ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా ఇవ్వగా, దీనిని సవరించి 1.5జీబీని అందిస్తోంది. మై ఐడియా యాప్ యూజర్లు అదనంగా 1జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. అంటే మొత్తంగా 2.5 జీబీని పొందవచ్చు.