ఈ మద్య భారత దేశంలో టెలికాం రంగంలో ఎన్నో పెను సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినప్పట్నుంచి ఈ ఆఫర్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో టెలికంరంగంలో పోటీ నడుస్తుంది. తాజాగా చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ క్రిస్మస్ కానుకగా ఈ నెల 20, 21వ తేదీల్లో తన ఎంఐ ఆన్లైన్ స్టోర్ mi.com లో నంబర్ వన్ ఎంఐ ఫ్యాన్ సేల్ పేరుతో ఓ స్పెషల్ సేల్ను నిర్వహిస్తున్నది.
ఎప్పుడైతే స్పెషల్ సేల్ నిర్వహిస్తుందో ఆ రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఫ్లాష్ సేల్లో వినియోగదారులు కేవలం రూ.1 కే షియోమీకి చెందిన రెడ్మీ 5ఎ, రెడ్మీ వై1 లైట్, ఎంఐ వీఆర్ ప్లే2 హెడ్సెట్, ఎంఐ రూటర్ 3సీ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ వైఫై రిపీటర్ 2లను దక్కించుకోవచ్చు.
అంతే కాదు వినియోగదారులకు స్మార్ట్ఫోన్లు, యాక్ససరీలపై రూ.50, రూ.100, రూ.200, రూ.500 డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. దీంతోపాటు పలు షియోమీ స్మార్ట్ఫోన్లు చాలా తక్కువ ధరలకే ఈ సేల్లో లభ్యం కానున్నాయి.