హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఏషియా శుభవార్త చెప్పింది. రూ. 1599కే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా కల్పిస్తోంది. దీంతో పాటు కొన్ని ప్రత్యేక రూట్లకు కూడా రూ. 1600 కంటే తక్కువకే విమాన టికెట్ అందజేస్తోంది. అయితే ఈ ఆఫర్ ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్కు మాత్రమే.
బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో దెబ్బకు ఇతర విమానయాన సంస్థలు దిగివస్తున్నాయి. ఆఫర్లో భాగంగా భువనేశ్వర్-కోల్కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మధ్య టికెట్లను రూ.1599కే అందించనున్నట్టు ప్రకటించింది. భువనేశ్వర్-కోల్కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మధ్య టికెట్ ప్రారంభ ధర రూ.1599గా ఎయిర్ఏషియా వెల్లడించింది.
అలాగే పూణె-బెంగళూరు, భువనేశ్వర్-బెంగళూరు, భువనేశ్వర్-రాంచీ, రాంచీ-కోల్కతా, కోల్కతా-బగ్డోగ్రా, గోవా-బెంగళూరు, గువహటి-ఇంఫాల్ల మధ్య ప్రయాణానికి టికెట్ ప్రారంభ ధర రూ.1899గా ఉంది. రాయితీ ధరలు 2018 మే 6వ తేదీ వరకు ప్రయాణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ ఆఫర్ ద్వారా జనవరి 14 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చు.