భారతీయ మార్కెట్లోకి  అనేక కొత్త మరియు చౌకగా స్మార్ట్ఫోన్ బ్రాండ్లు వస్తున్నాయి. వీటి రాక కారణంగా మార్కెట్లో పోటీ పెరిగింది. అలాగే, దీని కారణంగా, వినియోగదారు ఇప్పుడు బెస్ట్ స్పెక్స్ కలిగిన అతి తక్కువ ధరతో స్మార్ట్ఫోన్లు పొందుతున్నాడు . కొన్ని సంవత్సరాల క్రితం, భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ బలమైన పట్టును కలిగి ఉన్నప్పటికీ, శామ్సంగ్ యొక్క అనేక మంది వినియోగదారులు ఇప్పుడు ఇతర బ్రాండ్లకు వెళ్లిపోయారు.
Image result for samsung galaxy on 7 prime
ఈ నేపథ్యంలో శాంసంగ్ వారి లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్ ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు భార‌త మార్కెట్లో విడుద‌ల‌కానుంది. గురుగ్రామ్‌లో ఈ ఫోన్‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ క్లూజివ్ సేల్ జ‌ర‌గ‌నుంది. దీని అధికారిక ధ‌రను ఇంకా కంపెనీ ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రూ. 13000ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Image result for samsung galaxy on 7 prime

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికి వ‌స్తే :

5.5 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే, 

64 బిట్ శాంసంగ్ ఎక్సినోస్ 7870 ప్రాసెస‌ర్‌, 
13 ఎంపీ ప్రాథ‌మిక కెమెరా, 
13 ఎంపీ సెల్ఫీ స్నాప‌ర్‌, 
3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌నున్నాయి. 
4 జీబీ ర్యామ్‌, 3 జీబీ వేరియంట్ల‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. వీటిలో 64 జీబీ, 32 జీబీ స్టోరేజీ వుంటుంది. ఇందులో ప్ర‌త్యేకంగా శాంసంగ్ మాల్‌, శాంసంగ్ పే యాప్‌లు వున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: