బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో.. అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి.  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బడ్జెట్ ప్రారంభ సమయంలో 100 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్ బడ్జెట్ మొదలైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలపై రూ. లక్షకు మించి ఆదాయం వచ్చిన పక్షంలో 10 శాతం పన్ను విధిస్తామంటూ జైట్లీ ప్రకటించడంతో... మార్కెట్ల పతనం ప్రారంభమయింది. 

సెన్సెక్స్ ఏకంగా 463 పాయింట్లు పతనమైంది. ఈ తర్వాత క్రమంగా కోలుకుని చివరకు 58 పాయింట్ల నష్టంతో 35,907 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,017 వద్ద స్థిరపడింది.కార్పొరేట్ సెక్టార్ ఆశించిన తాయిలాలు ఏవీ యూనియన్ బడ్జెట్ తో అందకపోవడంతోనే మార్కెట్ వర్గాలు నిరాశ పడ్డాయని ఎనలిస్టులు అంటున్నారు. బడ్జెట్ లో కేంద్రం ప్రధానంగా గ్రామీణ, వ్యవసాయ రంగాల మీదే దృష్టి సారించినట్టుగా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రభావం మార్కెట్ మీద పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇవాల్టి టాప్ గెయినర్స్:
ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (11.09%), ఏజీస్ లాజిస్టిక్స్ (10.57%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (8.07%), అవంతి ఫీడ్స్ (7.95%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (7.25%).

టాప్ లూజర్స్:
వక్రాంగీ లిమిటెడ్ (-19.99%), జైన్ ఇరిగేషన్ (-9.43%), హిందుస్థాన్ కాపర్ (-5.70%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-4.96%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-4.95%).



మరింత సమాచారం తెలుసుకోండి: