ఈ మద్య భారత దేశంలో జియో చేస్తున్న సంచలనాలకు ఇతర టెలీకాం సంస్థలు కూడా భారీ ఆఫర్ల దిశగా సాగుతున్నాయి. తాజాగా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారతీఎయిర్టెల్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. నోకియా 2. నోకియా 3 కొనుగోలుదారులకు రూ. 2000 క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు ఎయిర్టెల్ స్పష్టం చేసింది. నోకియా 2, నోకియా 3 ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.
హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఆ ఆఫర్ అందుతున్నట్లుగా..ఈ ఆఫర్ ద్వారా 36 నెలల తర్వాత ఎయిర్టెల్ వాలెట్లో క్యాష్బ్యాక్ డబ్బులు రూ. 2000 జమ అవుతాయని తెలిపింది. 4జీ స్మార్ట్ఫోన్స్ వినియోగదారులు రూ. 169తో రీచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 1జీబీ 4జీ డేటా, అపరిమిత ఎస్టీడీ, లోకల్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ తెలియజేసింది.
నోకియా 3 స్మార్ట్ఫోన్ రూ. 9,499, నోకియా 2 రూ. 6,999కే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 3,500 విలువైన రీచార్జి చేసుకుంటే 18 నెలల్లో మొదటి విడత క్యాష్బ్యాక్ రూ. 500, రెండు సారి మరో రూ. 3,500 విలువైన రీచార్జ్ చేసుకుంటే రెండో విడత రూ. 1500 క్యాష్బ్యాక్ 18 నెలల్లో ఎయిర్టెల్ వాలెట్లో జమ అవుతుందని సంస్థ వెల్లడించింది.