గత కొంత కాలంగా భారతీయ టెలీకాం రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్న జియో ఎప్పటికప్పడు కొత్త కొత్త ఆఫర్లు ప్రయటిస్తూ..వినియోగదారులను ఆకర్షిస్తుంది. లయన్స్‌ జియో తన నెట్‌వర్క్‌ వాడకందారులను పెంచుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ ఆఫర్లు ప్రీపెయిడ్‌ వాడకందారులకు అమలులో ఉంటాయి.
Image result for jio new offer ambaji
ఈ ఆఫర్‌లో భాగంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనేవారికి రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ ఇస్తుంది. ఇందుకోసం రిలయన్స్‌ జియో 22 కంపెనీలతో జత కట్టింది. ఈ కంపెనీల ఫోన్లను కొని మార్చి 31లోగా జియో సిమ్‌తో రీచార్జి చేయించుకోవాలి. వెంటనే రూ.50 విలువగల 44 క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు కస్టమర్‌ మైజియో యాప్‌లో ఉంచుతుంది. ప్రతిసారి రూ.198 లేదా రూ.299కి పైగా రీచార్జి చేయించుకునే వినియోగదారుడు క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల ద్వారా రాయితీపొందే వీలు కల్పించింది.
Image result for jio new offer ambaji
2022 మే 31 వరకు ఈ ఓచర్లు చెల్లుబాటు అవుతాయి. జియో మొదటిసారిగా జివి మొబైల్స్‌ సంస్థతో పెట్టుకున్న ఒప్పందంతో రూ.2,899 విలువైన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలుచేసి రూ.2,200 ఫుట్‌బాల్‌ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే రూ.699కే ఫోను సొంతం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: