టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌  దూకుడు ప్రదర్శింస్తోది. కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ప్రకటించిన మరుసటి రోజే మరో సరికొత్త ప్లాన్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది.   తాజాగా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు స్విచ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది.
Airtel introduces   New Prepaid Plan Rs 249 recharge  - Sakshi
ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఇప్పటికే   రూ.249  ప్లాన్‌. రూ.249రీఛార్జ్‌  ద్వారా వినియోగదారులు  రోజుకు 2 జీబీ  (3జీ/4జీ) డేటా అందిస్తుంది.  ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు.  దీంతోపాటు  అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించిన విషయం తెలిసిందే.
Image result for airtel
కాగా  రూ.499 రీఛార్జ్‌తో నిన్న (మంగళవారం) కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. తాజాగా ప్రీపెయిడ్ కస్టమర్లయితే రోజూ ఒక జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ ఇవ్వనుండగా.. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ డేటా కూడా రోల్‌ఓవర్ అవుతుంది.
Image result for airtel
ఈ ఆఫర్‌కు మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి 51111కు కాల్ చేయండి లేదా మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గతంలో ఇదే మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కింద లెనోవో, సెల్కాన్, నోకియా, ఇంటెక్స్, సామ్‌సంగ్ మొబైల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కస్టమర్లకు రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందించింది.అర్హులైన కస్టమర్లకు 24 గంటల్లోపు ఫ్రీడేటాను యాక్టివేట్ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: