ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.  ఎయిర్ టెల్ కంపెనీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై తగ్గింపు ధరల్ని ప్రకటించింది. ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే 15 శాతం, ఏడాది ప్లాన్ అయితే 20 శాతం డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది.   

ఎయిర్‌టెల్ బ్రాండ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రతీ సర్కిల్‌లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ఆరంభం అవుతున్న నేపథ్యంలో ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం ఎయిర్ టెల్ కు సవాల్ గా మారనుంది.

ఎయిర్‌టెల్‌ తాజా ఆఫర్ వివ‌రాలివీ :
నెల‌వారీ ప్లాన్ ధ‌ర రూ.2199 
వేగం: 300 ఎంబీపీఎస్ ఇంటెర్నెట్ స్పీడ్ 
అమెజాన్ ప్రైమ్ సబ్‌‌స్క్రిప్షన్‌, 
వ‌చ్చే డేటా: 1200 జీబీ డేటా

ఇంకా: అపరిమిత వాయిస్ కాల్స్‌ 
అయితే, ఈ ప్లాన్‌ను ఏడాదికి తీసుకుంటే కనుక నెల‌కు రూ.1,758కే లభిస్తుంది. 
అదే ఆరు నెలలకు అయితే నెలకు రూ.1866 చెల్లించాల్సి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: