ప్రముఖ మొబైల్‌ సంస్థ బ్లాక్‌బెర్రీ ఆకట్టుకొనే క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు, డ్యూయల్‌ కెమెరాలాంటి ఫీచర్లతో నూతన స్మార్ట్‌ఫోన్‌ ని విడుదల చేసింది.   బ్లాక్‌బెర్రీ తన నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ కీ2 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.42,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి ప్రత్యేకంగా లభ్యం కానుంది.

ఈ ఫోన్‌పై జియో రూ.4,450 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు తో పాటు 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ని ఇందులో ఏర్పాటు చేశారు. ధర రూ.42,990గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారిగా డ్యూయల్‌ కెమెరాలతో విడుదల అవుతోంది.  దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ఉపయోగించి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని పొందవచ్చు.


బ్లాక్‌బెర్రీ కీ2’ ఫీచర్లు:
12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4.5ఇంచ్ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
6జీబీ ర్యామ్, 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (2టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3500ఎంఏహెచ్ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: