దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. చైనా ఆర్థిక వృద్ది రేటు మరింత మందగించ నుందన్న అంచనాలు ఆసియా మార్కెట్లను బలహీపర్చాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ ఒకదశలో 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు తగ్గబోతోందంటూ ఐఎంఎఫ్ ప్రకటించడంతో... దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి.


ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 134 పాయింట్లు కోల్పోయి 36,445కు పడిపోయింది.


నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 10,923 వద్ద స్థిరపడింది. గత ఐదు రోజుల లాభాలకు చెక్‌ చెప్పాయి. సన్‌ఫార్మా, విప్రో గెయిల్‌, కోటక్‌బ్యాంక్‌, టైటన్‌, డా.రెడ్డీస్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హిందుస్థాన్ తదితర సంస్థలు లాభపడ్డాయి. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: