దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. భారత్ లో ఎన్నికల ఎఫెక్ట్ బాగానే పడింది.  ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలోనూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా లాభాలతో దౌడు తీశాయి.  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

ఈ క్రమంలో ఆరు నెలల గరిష్ఠ స్థాయికి మార్కెట్లు చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 37,054కు చేరుకుంది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 11,168కి ఎగబాకింది. 2018 సెప్టెంబరు తరువాత  (సెన్సెక్స్‌ 37,121, నిఫ్టీ 11169)ఈ స్థాయిలో  ముగియడం ఇదే తొలిసారి. లోక్‌సభకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఉన్నట్టుండి జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (8.08%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.90%),  కోల్ ఇండియా (3.80%), వేదాంత లిమిటెడ్ (2.52%), టాటా స్టీల్ (2.51%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.41%), హెచ్సీఎల్ (-0.39%), ఎన్టీపీసీ (-0.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.21%), ఇన్ఫోసిస్ (-0.13%). 



మరింత సమాచారం తెలుసుకోండి: