దేశంలో ఇప్పుడు అన్ని సర్వేలు మోదీ గెలుపు వైపే చూపుతున్నాయి.  ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో, స్టాక్ మార్కెట్ పరుగులకు అడ్డు లేకుండా పోయింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు షేర్ మార్కెట్ పై బాగానే పడింది.   గత రికార్డ్ అయిన 39,487 పాయింట్లను సెన్సెక్స్ దాటేసింది. ఒక దశలో 39,571.73 పాయింట్లను తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

సోమవారం నాడు భారీగా లాభపడ్డ సెన్సెక్స్, నేడు కూడా అంతే ఉత్సాహంగా సాగుతోంది. సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డును దాటింది.  ఇదే సమయంలో ఎన్ఎస్ఈ క్రితం ముగింపుతో పోలిస్తే 26.

పాయింట్లు పెరిగి 11,855. 5 పాయింట్ల వద్ద ఉంది. డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ ఫ్రాటెల్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: