యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా సాహో. ఇక ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న సినిమా టీజర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన రికార్డు వ్యూస్ లో యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించిన సినిమాని అత్యంత భారీ వ్యయంతో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మది కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న సినిమాకు రామ్ లక్ష్మణ్ సహా మరికొందరు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఫైట్స్ భారీ స్థాయిలో కంపోజ్ చేస్తున్నారట. ఇకపోతే నేడు సినిమాకు సంబంధించి ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది

 

 

అదేమిటంటే, టీజర్ ని బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి యాక్షన్ ప్రధాన అంశాలతో సాగె సినిమా అని మనకు చాలావరకు అర్ధం అవుతుంది, అయితే సినిమాలో వెన్నెల కిషోర్ వంటి కమెడియన్లు ఉన్నప్పటికీ కామెడీ శాతం మాత్రం సినిమాలో ఒకింత తక్కువగానే ఉంటుందని అంటున్నారు. దానికి ప్రధాన కారణం సినిమా ఆద్యంతం కథను బట్టి ముందుకు సాగుతుందని, అయితే దర్శకుడు కథను పక్కదారి మళ్లించే విధంగా స్పెషల్ గా కామెడీని ఇరికించలేదని అంటున్నారు. దానివలన సినిమాలో యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కొన్ని కామెడీ ప్రధానమైన తెలుగు సినిమాలు ఎంతటి హిట్ అయ్యాయో తెలిసిందే. విధంగా చూస్తే కామెడీ లేకపోవడం సాహోకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు

 

 

అయితే దీనిపై సినీ విశ్లేషకులు ఏమంటున్నారంటే, సినిమా ఏదైనా కామెడీనా లేక యాక్షనా, ఎమోషనా, లేక కుటుంబ కథ చిత్రమా అనే విషయాలు ప్రక్కన పెడితే, ఒక సినిమాను దర్శకుడు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడానికి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది మాత్రమే ప్రధానమని, ఇటీవల వచ్చిన కొన్ని పెద్ద హిట్టైన సినిమాల్లో కామెడీ లేకపోయినప్పటికీ వాటిలోని బలమైన కథ వాటిని అంత పెద్ద గా నిలిపిన విషయాన్ని మనం మర్చిపోకూడదని అంటున్నారు. దాని ప్రకారం దర్శకుడు సుజిత్ సాహో సినిమాను అందరిని ఆకట్టుకునేలా కనుక తీయగలిగితే పెద్ద హిట్ అవడం ఖాయమని, అయితే సినిమా కథలోనే కామెడీ మిళితం అయి ఉండొచ్చని తాము భావిస్తున్నట్లు వారు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం సాహో విడుదల వరకు వేచిచూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: