'కియా' లో ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్..!!
అనంత పురం జిల్లాలోని పెనుకొండ 'కియా' పరిశ్రమను శనివారం బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి కియాను పరిశీలించారు. మంత్రి వెంట, కలెక్టర్ సత్యనారాయణ, జేసీ డిల్లీరావు, ఇతర అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా కియా పరిశ్రమ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్ మంత్రికి.. వివరించారు. సీఎం ఆదేశాల మేరకు స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కియా యాజమాన్యాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
తమ ప్రతిపాదనకు కియా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించిందని , కియాకు
భూములు ఇచ్చిన 375 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినట్లు మంత్రి
శంకరనారాయణ తెలిపారు. అంటే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, భూములిచ్చిన 375
కుటుంబాలకు ఉద్యోగాల వ్యవహారంలో కియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రకటనతో
భూములిచ్చిన రైతులు ఆనందంగా ఉన్నారు.