కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్ షాకులు ఇంకా కొన‌సాగుతున్నాయి. బ‌డ్జెట్ నిర్ణ‌యాల నేప‌థ్యంలో...ఆయా రంగాల‌పై ప‌డే ప్ర‌భావం గురించి జ‌రుగుతున్న అధ్య‌య‌నాల ఫ‌లితంగా ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా, సామాన్యుల‌పై ప‌డే చార్జీల భారంలో కొత్త అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. పొల్యూషన్ తగ్గించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు త‌రుణంలో....డీజిల్, పెట్రోల్​తో నడిచే వాహ‌నాల‌కు త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వాటి రెన్యూవల్ చార్జీలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. 


కాలుష్యం విష‌యంలో డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే వాహనాలతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో అలాంటి సమస్య  ఉండదు. దీంతో కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే డీజిల్​, పెట్రోల్​ వాహ‌నాల‌ను తగ్గించి, ఎలక్ట్రికల్​ వాహనాలను ప్రోత్సహించడమే మంచిదని కేంద్రం  భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించింది. 15 సంవ‌త్స‌రాల‌కు పైబడిన డీజిల్, పెట్రోల్​ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం చార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు ముగిసిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెన్యువ‌ల్‌లో భాగంగా, ప్యాసింజర్ కార్లకు రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ 10,000కు పెంచనున్నారు. ట్యాక్సీలు అయితే  రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ 1,000 నుంచి సుమారుగా రూ 15,000 కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ట్రక్కుల రెన్యువల్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 2,000 నుంచి రూ. 40,000 కు పెంచే అవకాశాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: